Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే.. పాముకాటుతో 21 ఏళ్ల యువకుడి మృతి

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (15:28 IST)
త్రిసూర్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత పాము కాటుతో మరణించాడు. కర్ణాటకలోని తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థి ఆదిత్ బాలకృష్ణన్ పాముకాటు గురై మృతి చెందాడు.
 
బెంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో స్నాతకోత్సవానికి హాజరైన ఆయన తన నివాసానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పార్కింగ్‌లో బాలకృష్ణన్ పాము కాటుకు గురై వుంటాడని అనుమానిస్తున్నారు. అయితే పాము కాటుకు గురైందని గుర్తించకపోవడంతో తన నివాసానికి వెళ్లాడు. ఆదిత్ తల్లి, ఇతర బంధువులు కూడా స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 
 
నివాసానికి చేరుకున్న ఆదిత్ బాత్‌రూమ్‌లోకి ప్రవేశించగా, తలుపు తెరవకపోవడంతో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఆస్పత్రిలో పరీక్ష చేయగా కాలుపై పాము కాటు వేసిన గుర్తు కనిపించింది. 
 
పోస్ట్ మార్టం పరీక్షలో రక్తంలో పాము విషం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఎంపీ శశిథరూర్ ఆదిత్  స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments