Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ కట్టడి- లాక్ డౌన్‌ను స్వాగతిస్తున్నాం.. మాయావతి

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (14:30 IST)
ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లోనూ విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే... ఆ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెలిపారు. ''నిశితమైన పరిశీలన తర్వాత కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించినట్లయితే, దాన్ని బీఎస్పీ స్వాగతిస్తుంది'' అని ఆమె ట్వీట్ చేశారు. 
 
ఈ సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని అన్నారు. పేదలు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతులకు సాయం చేయాలని, వారిని దృష్టిలో ఉంచుకొనే తగిన నిర్ణయాలు తీసుకోవాలని మాయావతి సూచించారు.
 
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో కొవిడ్‌ -19 మహమ్మారి విజృంభిస్తోంది. 12 గంటల్లోనే కొత్తగా మరో 92 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1666కు చేరింది. శనివారం నిర్ధారణ అయిన 92 కేసుల్లో ఒక్క ముంబై మహా నగరంలోనే 72 కేసులు నమోదుకావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments