Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటకు 165 మంది మృతి-మే నెలలో మరణ మృదంగం

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:49 IST)
భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మే నెలలో దేశంలో కరోనా మహమ్మారి మృత్యు తాండవం చేసింది. గంటకు సగటున 165 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచంలోని ఏ దేశంలో లేనివిధంగా..... వేల మందిని బలి తీసుకుంది. మహమ్మారి ధాటికి  రోజుకు వందల మంది అసువులు బాశారు. 
 
మే నెలలో కరోనాతో భారత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. మే నెలలో రోజువారీగా నాలుగు లక్షల కేసులు దాటాయి. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలో నమోదు కానంతగా అత్యధిక కేసులు, మృతులు మే నెలలో వెలుగు చూశాయి. మే నెలలో 33 శాతం మృతులు చోటుచేసుకున్నాయి. అలాగే 1.2 లక్షల మృతులు నమోదైనాయి. 
 
ఇక ఈ నెలలో గంటకు దాదాపు 165మంది ప్రాణాలు కోల్పోయారు. మే 19న రికార్డు స్థాయిలో 4529 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ఒకటిన్నర లక్ష మృతులు నమోదైనాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరణాల రేటు అధికం. 2.9 శాతం మృతుల రేటు నమోదయ్యాయి. ఢిల్లీలో మే నెలలో 8వేలకు పైగా మృతులు చోటుచేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments