Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వద్దన్నా వినలేదు.. పారకర్రతో తలపై బాదాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:20 IST)
వివాహేతర సంబంధాలు కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను హతమార్చాడు భర్త.. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మ బండలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ జిల్లా మరికల్ గ్రామానికి చెందిన సువర్ణ (32), రాజు పదేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. బ్రతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం వారి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే చిన్నాచితకా పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
 
గత కొంత కాలంగా వీరిద్దరూ ఒకే మేస్త్రీ వద్దకు పనికి వెళ్తున్నారు. సువర్ణ అక్కడ ఓ వ్యక్తితో చనువుగా ఉంటుండటంతో భర్త రాజుకు అనుమానం వచ్చింది. అనేక సార్లు అతడితో మాట్లాడొద్దని సువర్ణను హెచ్చరించాడు రాజు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
ఈ నేపథ్యంలోనే బుధవారం ఇదే విషయమై ఇరువురికి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు పారకర్రతో తలపై బాదాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments