Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైన్యంలో చీలికలు.. పాకిస్థాన్‌పై ఫైర్ అయిన భారత్

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (10:18 IST)
భారత సైన్యంలో చీలికలు తెచ్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం సాగుతోంది. పాకిస్థాన్ కుట్రలు, కుతంత్రాలకు హద్దే లేకుండా పోతోంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సైన్యానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని దుయ్యబట్టింది. ముఖ్యంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ సీనియర్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ తరన్‌జిత్ సింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
మతం ఆధారంగా భారతదేశంలో వైరుద్ధ్యాలు సృష్టించేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో నిస్సహాయంగా మారిన పాక్‌... భారత సైన్యంలో విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
 
మరోవైపు పాకిస్థాన్ తాను చేసిన తప్పులను ఒప్పుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ గురించి మాట్లాడింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ విషయంలో పాకిస్థాన్ నాయకత్వం గతంలో తప్పులు చేసిందని, ఆ తప్పులను పునరావృతం కానివ్వబోమని తెలిపింది. 
 
ఆఫ్ఘనిస్థాన్ హై కౌన్సిల్ ఫర్ రీకన్సిలియేషన్ (హెచ్‌సీఎన్ఆర్) చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిథి బృందం పాకిస్థాన్ నేతలను కలిసింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ పశ్చాత్తాప వచనాలు వినిపించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments