Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెట్రో రైలు సిబ్బందిని కూడా వదలని కరోనా.. 28 మందికి పాజిటివ్

Advertiesment
Metro staff
కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. తాజాగా లాక్‌డౌన్ అనంతరం సెప్టెంబరు 7 నుంచి బెంగళూరు మెట్రో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో... అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ 28 మంది మెట్రో సిబ్బందికి కరోనా సోకింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్సీఎల్) అధికారి ఒకరు మీడియాకు ఈ విషయం తెలియజేశారు. 
 
కరోనా బారిన పడినవారంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. కాగా కరోనాను కట్టడి చేసే ఉద్దేశంతో మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలను నిలిపివేశారు. ఇటీవలే ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో సేవలు ప్రారంభంకాగా, అక్టోబర్ 4 నుంచి కోల్‌కతా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. 
 
ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో అధికారి ఒకరు మాట్లాడుతూ అక్టోబరు 4 నుంచి తొలుత నావోపాడా- కవి సుభాష్ స్టేషన్‌ల మధ్య మెట్రోసేవలు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాళ్ళని రెచ్చగొట్టడమే చంద్రబాబు పని, రోజా ఫైర్.?