Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ అమెరికా పర్యటన పై ఎన్నో ఆశలు!

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:33 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. ఈ పర్యటన తో మన దేశానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. 27 వరకు సాగనున్న ఈ పర్యటనలో.. 'హౌదీ మోదీ' సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రధాని.

అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్​తో భేటీ కానున్నారు. మోదీ పర్యటన వివరాలపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు స్మితా శర్మ సమగ్ర విశ్లేషణ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో వేదిక పంచుకోవడం, చమురు కంపెనీలతో చర్చ, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగే వాతావరణ మార్పులో విధానాలపై ప్రసంగం, సాధారణసభలో కీలక ప్రసంగం సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన బిజీబిజీగా గడవనుంది.

పాకిస్థాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో 20 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు మోదీ. శుక్రవారం అమెరికా వెళ్లిన మోదీ హ్యూస్టన్, న్యూయార్క్​ల్లో నగరాల్లో ప్యాకేజీ అజెండా ఆయన కోసం వేచిచూస్తోంది. ప్రపంచ చమురు దిగ్గజాలైన ఎక్జాన్ మొబైల్, బీపీ వంటి సంస్థలతో మోదీ శనివారం భేటీ కానున్నారు.
 
జిన్​పింగ్​ తో భేటీ
మరికొద్ది వారాల్లో భారత్-చైనా అగ్రనేతలు నరేంద్రమోదీ, షి జిన్​పింగ్ భేటీ కానున్నారు. జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు నేపథ్యంలో పాకిస్థాన్ అనుకూలంగా మాట్లాడిన డ్రాగన్ దేశం.. ఈ సదస్సులో ఏ వైఖరి అవలంబించనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇప్పటివరకూ ఇలా ఎన్నో అడుగులు వేసినప్పటికీ భారత్​, చైనాల మధ్య నెలకొన్న అపనమ్మకాలు.. అతికష్టం మీద తీరే అవకాశాలు ప్రస్తుతం కన్పిస్తున్నాయి. గతేడాది జరిగిన వుహాన్​ సదస్సు ఇచ్చిన ఉత్సాహంతో చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ను అనధికారిక పర్యటన కోసం అక్టోబర్​లో భారత్​కు రావాలని ఆహ్వానించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

షాంఘై సహకార సంస్థ(ఎస్​సీఓ), జపాన్​​లో జరిగిన జీ-20 దేశాల సదస్సు వేదికగా ఇప్పటికే ఇరునేతలు ఈ ఏడాదిలో రెండు సార్లు భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఇరునేతల భేటీకి సన్నాహాలు జరుగుతున్న వేళ చైనా టెక్​ దిగ్గజం హువావే 5జీ నెట్​వర్క్​కు భద్రతా అనుమతులు ఇవ్వకూడదని భారత్​పై ఒత్తిడి తెస్తోంది అగ్రరాజ్యం అమెరికా.

సమగ్ర ప్రాంతీయ ఆర్థిక సహకారం(ఆర్​సీఈపీ)పై చైనాతో ఆసియాన్ దేశాల విముఖత, వుహాన్​లో అవగాహనకు వచ్చిన బీసీఐఎమ్​(బంగ్లాదేశ్, చైనా, భారత్, మయన్మార్) ఆర్థిక నడవా, జపాన్​ పెట్టుబడుల ప్రోత్సాహం కోసం.. ఈశాన్య దేశాల సహకారం నుంచి చైనాను దూరంగా ఉంచడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments