Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల ప్రచారానికి వెళ్లాలి... మధ్యంతర బెయిల్ ఇవ్వండి : మనీశ్ సిసోడియా

వరుణ్
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (16:26 IST)
లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న తరపున ప్రచారం చేయాల్సివుందని, అందువల్ల తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కోరారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సిసోడియా పిటిషన్‌ను స్వీకరించిన సీబీఐ, ఈడీ ప్రత్యేక కోర్టు.. దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయన అభ్యర్థనపై స్పందనలు తెలియజేయాలని ఈడీ, సీబీఐ అధికారులను ఆదేశించింది. అనంతరం దీనిపై విచారణను ఏప్రిల్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.
 
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తిహాడ్‌ జైల్లో ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్‌ కోరుతూ ఆయన పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు.
 
మరోవైపు, ఇదే కేసులో ఇటీవల ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అరెస్టవగా.. ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. ఎన్నికల వేళ  ఆమ్‌ఆద్మీని బలహీనపర్చేందుకే తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని పార్టీ ఆరోపిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆప్‌ పోటీ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments