మణిపూర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఎన్ఎస్సీఎల్ తీవ్రవాదులు తుపాకీ కాల్పులతో పాటు.. వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ కాల్పులు, బాంబు పేలుళ్ళ నుంచి సీఎం ఇబోబీ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్ప
మణిపూర్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని ఎన్ఎస్సీఎల్ తీవ్రవాదులు తుపాకీ కాల్పులతో పాటు.. వరుస బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. ఈ కాల్పులు, బాంబు పేలుళ్ళ నుంచి సీఎం ఇబోబీ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్కు 84 కిలోమీటర్ల దూరంలోని ఉక్రుల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నిర్మించిన ఆసుపత్రితో పాటు పలు భవనాల ప్రారంభోత్సవానికి ఆయన వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఉక్రుల్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాల్పులు జరిగిన సమయంలో ఇబోబీసింగ్ వెంట ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గైకాంగామ్ కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మణిపూర్ రైఫిల్స్ జవాన్లకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో వెంటనే ముఖ్యమంత్రిని ఆ ప్రాంతం నుంచి ఇంఫాల్ కు తరలించారు.