ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగనున్న వేళ అక్కడి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. తాజాగా సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర రీతిలో ప్రధానమంత్రి మోదీన
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరుగనున్న వేళ అక్కడి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. తాజాగా సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆసక్తికర రీతిలో ప్రధానమంత్రి మోదీని ఆకాశానికెత్తేశారు. 'మన ప్రధాని మోదీని చూడండి.
పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన అకుంఠిత శ్రమతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఆయన అంకితభావం చాలా గొప్పది. తన కన్నతల్లిని ఎన్నటికీ వీడనని ఎల్లవేళలా చెబుతూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎలా తన తల్లి గురించి చెపుతున్నారో తనకు శివపాల్ యాదవ్, అమర్ సింగ్ ఇద్దరూ అంతే. వారిని నేను ఎన్నటికీ వదిలిపెట్టను.
వారు పార్టీకి, తనకు కష్టకాలంతో ఎంతో చేశారు" అంటూ వ్యాఖ్యానించారు. కాగా ములాయం మాట్లాడుతుండగానే అఖిలేష్ యాదవ్ అడ్డుపడినట్లు సమాచారం. తను కొత్త పార్టీ పెడుతున్నాననీ, తండ్రికి ఎదురుతిరుగుతున్నాననీ ఏవేవో వార్తలు బయటకు వస్తున్నాయనీ, అవన్నీ అవాస్తవాలని చెప్పుకొచ్చారు. పార్టీ ఆదేశిస్తే తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.