Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో ఘోరం... బస్సు బోల్తా 15 మంది విద్యార్థుల మృతి

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (18:05 IST)
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. చనిపోయిన వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రంలోని నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి ఈ బస్సు బయలుదేరి లంగ్సాయి తుబంగ్ వద్ద బోల్తాపడింది. 
 
ఈ విద్యార్థులంతా యారిపోక్‌లోని తంబాల్ను హైయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు. ఎడ్యుకేషన్ టూర్ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మణిపూర్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments