కుటుంబ కలహాలు... భార్యను పాశవికంగా వేటకొడవలితో నడిరోడ్డుపైనే?

తమిళనాడులో పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త పాశవికంగా హతమార్చాడు. నడిరోడ్డుపైనే వేటకొడవలితో నరికి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుగల్ జిల్లా రాజపాలెంలో చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (13:31 IST)
తమిళనాడులో పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను ఓ భర్త పాశవికంగా హతమార్చాడు. నడిరోడ్డుపైనే వేటకొడవలితో నరికి చంపేశాడు. ఈ ఘటన తమిళనాడు, దిండుగల్ జిల్లా రాజపాలెంలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డుపై తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో నరికి చంపాడు. వెంటనే కొందరు అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చారు. దీంతో, మదీశ్వరన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడున్నవారు పోలీసులకు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మరణించింది. ఈ ఘటన గత నెల 20వ తేదీన జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని మదీశ్వరన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్‌లో జరిగిన ఈ దారుణం సీసీటీవీలో రికార్డయింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments