Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదో ఒక రోజుకి పవన్ కల్యాణ్‌ని మర్చిపోవాలి... ఎందుకు?

జనసేన సైనికులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ముఖ్యమైన పిలుపునిచ్చారు. ఏదో ఒక రోజున తనను మరిచిపోవాలని సూచించారు. తనను తలుచుకోవడంమానేసి కేవలం పార్టీ పేరునే తలుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. అంటే... జనసే

Webdunia
శుక్రవారం, 6 జులై 2018 (13:04 IST)
జనసేన సైనికులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ముఖ్యమైన పిలుపునిచ్చారు. ఏదో ఒక రోజున తనను మరిచిపోవాలని సూచించారు. తనను తలుచుకోవడంమానేసి కేవలం పార్టీ పేరునే తలుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. అంటే... జనసేన పార్టీయే గుర్తుండాలన్నదే తన కోరిక అన్నారు.
 
విశాఖపట్టణం నగరంలో జరిగిన జనసేన కార్యకర్తల, నాయకుల సమావేశంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రేమతో వచ్చే వాళ్లని, డబ్బులిస్తే వచ్చే వాళ్లు కాదన్నారు. జనసైనికుల భావావేశాలను నాయకులు అర్థం చేసుకోవాలని, వాళ్ల ఉత్సాహం కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినప్పటికి, వాళ్లు చూపే ప్రేమ ఎనలేనిదని కొనియాడారు.
 
తాను 25 కోట్ల రూపాయల పన్ను చెల్లించే స్థాయిని వదులుకుని మీకోసం వచ్చినట్టు చెప్పారు. మీ కోసం వచ్చాను. మీరు లేకపోతే జనసేన లేదు. భావజాలం ముఖ్యం కానీ, వ్యక్తులు కాదు. ఏదో ఒక రోజుకి పవన్ కల్యాణ్‌ని మర్చిపోయి.. జనసేన పార్టీయే గుర్తుండాలనేది నా కోరిక. ‘జనసేన’ భావజాలం అందరిలో బలంగా నాటుకుపోవాలి అని పవన్ పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో టీడీపీ నేతలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంటే ఏమైనా పైనుంచి దిగొచ్చారా? వాళ్లకు మేమేమైనా బానిసలమా? అంటూ ప్రశ్నించారు. ప్రజాసేవ కోసం వచ్చినవారు, రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకు, ఎమ్మెల్యే అల్లుడు ఎవరైనా సరే పరిధికి లోబడే నడుచుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తామంటే... చేతులు కట్టుకుని కూర్చోబోమని... పిచ్చిపిచ్చి వేషాలు వేయవద్దని హెచ్చరించారు.
 
అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని... పోతే ప్రాణాలే పోతాయని ధైర్యంగా అడుగువేశానని పవన్ చెప్పారు. రాజకీయ నాయకులు తలచుకుంటే ఒక్క సంతకంతో తలరాతలు మార్చేయవచ్చని తెలిపారు. తెలంగాణలో ఓ పెన్ను పోటుతో ఉత్తరాంధ్రకు చెందిన 23 వెనుకబడిన కులాలను జాబితా నుంచి తొలగించారని... అదేవిధంగా ఏపీలో టీడీపీ నేతల సంతకాలతో ప్రజల తలరాతలు మారిపోతున్నాయని చెప్పారు. 
 
మౌనంగా చూస్తూ కూర్చుంటే విశాఖలోని డాల్ఫిన్ కొండలను కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకుంటారని అన్నారు. తప్పు చేస్తున్నవారిని తానెందుకు ప్రశ్నించకూడదని నిలదీశారు. అదేసమయంలో తన పార్టీకి కులం పేరును ఆపాదిస్తే మాత్రం కాళ్లు విరగ్గొట్టడం ఖాయమని పవన్ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments