Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి ముఖంపై శానిటైజర్ చల్లి... లైటర్‌తో తగలబెట్టేశాడు... ఎక్కడ?

Webdunia
బుధవారం, 15 జులై 2020 (12:12 IST)
చండీగఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన ప్రియురాలి ముఖంపై శానిటైజర్ చల్లిన ఓ ప్రియుడు.. లైటర్‌తో తగులబెట్టి చంపేశాడు. దీనికి కారణం కేవలం 2 వేల రూపాయలు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చండీగఢ్ రాష్ట్రంలో కిరాతకుడు తన ప్రియురాలిని రూ.2 వేలు ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ముఖంపై శానిటైజర్‌ చల్లి.. లైటర్‌తో నిప్పు అంటించాడు. 
 
ఈ ఘటనలో ఆమె ముఖం 20 శాతం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని వారు చెప్పారు. 
 
కాగా.. బాధితురాలి వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. డబ్బుల కోసం అతడు బాధితురాలిని తరచూ వేధించేవాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments