Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలు అద్దం ఎందుకు పగులగొట్టాడంటే... (Video)

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:58 IST)
సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ యువకుడు సుత్తితో వందే భారత్ రైలు కిటికీ అద్దాన్ని పగులగొడుతుండటం ఆ వీడియోలో కనిపించింది. అయితే, ఆ యువకుడు ఎందుకు వందే భారత్ అద్దాన్ని పగులగొడుతున్నాడంటూ సోషల్ మీడియాలో వేదికగా అనేక మంది నెటిజన్లు ప్రశ్నిస్తూ కామెంట్స్ చేశారు. 
 
దీనిపై రకరకాలైన సమాధానాలు, అభిప్రాయాలు వెల్లడయ్యాయి. కొందరైతే ఈ పనికి పాల్పడిన ఆ యువకుడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంతకీ అద్దాన్ని పగులగొడుతున్న యువకుడు ఎవడు, అద్దం పగులగొట్టడానికి కారణం ఏంటి, అది ఏ స్టేషన్, ఆ వందే భారత్ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 
 
వీటికి ఇపుడు సమాధానం లభించింది. ఆ వందే భారత్ రైలు ఆగివున్నది ఓ రైల్వే స్టేషన్ కాదు. ఓ ట్రైన్ కోచ్ కేర్ సెంటర్ అని తేలింది. ఆ యువకుడు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేసే ఉద్యోగి. వందే భారత్ రైలుకు పాడైపోయిన అద్దాన్ని తొలగించి, దాని స్థానంలో కొత్త అద్దం బిగించేందుకు పాత అద్దాన్ని ఆ విధంగా సుత్తితో కొట్టి తొలగిస్తున్నాడని తెలిసింది. ఏది ఏమైనా ఈ వీడియోకు మాత్రం లైకులు, షేర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments