Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెలుగులోకి వస్తున్న వైకాపా మాజీ మంత్రి విడదల రజినీ అవినీతి లీలలు!

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (10:31 IST)
గత వైకాపా ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడదల రజినీ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతి ఇపుడు వెలుగులోకి వచ్చింది. నిజానికి అధికారంలో ఉన్న సమయంలోనే ఈమె చేసిన అవినీతి గురించి విస్తృతంగానే ప్రచారం జరిగింది. అయితే, ఆమెకు మాజీ సీఎం జగన్ అడ్డుకట్ట వేయలేదు. అప్పట్లో బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడారు. ప్రభుత్వం మారడంతో వారంతా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పోలీసులతో చెప్పుకొంటున్నారు. 
 
జగనన్న కాలనీ పేరిట తమవద్ద భూములు సేకరించి కమీషన్ వసూలు చేశారని, అవి ఇప్పించాలని జూన్ నెలలో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు మొరపెట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు, గుడిపూడి గ్రామాల రైతుల నుంచి 200 ఎకరాలను మాజీమంత్రి రజినీ అనుచరులు సేకరించారు. 32 మంది నుంచి తొలుత 50 ఎకరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తమకు రజినీ నుంచి రూ.1.16 కోట్లు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు, ఎంపీకి విన్నవించుకోగా, ఆ మొత్తాన్ని ఇప్పించారు. 
 
మాజీమంత్రి రజినీ రంగంలోకి దిగి రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేకపోతే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని తనను బెదిరించారని ఓ స్టోన్ క్రషర్ యజమాని పోలీసులకు తాజాగా ఫిర్యాదుచేశారు. తనతోపాటు మరో ముగ్గురు కలిసి స్టోన్ క్రషర్ నడిపిస్తుంటే మాజీమంత్రి రజినీ బెదిరించారని యడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. 
 
ఆమెకు వత్తాసుగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా కూడా డబ్బులు ఇవ్వకపోతే రూ.50 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బాధితులను వేధించారు. దీంతో చేసేదిలేక రూ.2.20 కోట్లు రజినికి, ఆమె అనుచరులకు ఇచ్చామని, వాటిని తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఇదే విధంగా పలువురు బాధితులు రజినీ ఆగడాలపై ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments