కలిసి బతుకుదామని నమ్మించి కోర్టు హాలులోనే భార్య గొంతుకోసిన భర్త

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (13:54 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కలిసి జీవిద్దామని భార్యను నమ్మించి కోర్టుకు తీసుకొచ్చిన ఓ కసాయి భర్త... కోర్టు హాలులోనే భార్య గొంతు కోశాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని హలెనరసిపుర ఫ్యామిలీ కోర్టులో జరిగింది. పైగా, ఈ భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులు కావడం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లాకు చెందిన శివకుమార్, చైత్ర అనే మహిళకు ఏడేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. 
 
ఈ క్రమంలో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, వారికి కౌన్సెలింగ్ ఇచ్చింది. విభేదాలు పరిష్కరించుకుని, కలిసి జీవించాల్సిందిగా సూచించారు. కౌన్సెలింగ్ సెషన్‌లో చెప్పిన ప్రతి మాటకు సమ్మతించారు. 
 
కౌన్సెలింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చైత్ర బాత్రూమ్‌కు వెళుతుండగా, శివకుమార్ ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడిపోగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, కోర్టులో ఉన్న ఇతరులు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అలాగే, రక్తపుమడుగులో ప్రాణాపాయస్థితిలో ఉన్న చైత్రను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments