Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో కాల్పులు కలకలం: వ్యక్తి మృతి.. ఇద్దరు బాలికలకు గాయం

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (18:38 IST)
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు బాలికలు గాయపడ్డారు. బుధవారం రాత్రి అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు నలుగురు వ్యక్తులు వాహనాల్లో వచ్చారు. పూజ మండపం వద్ద ఉన్న ఒక వ్యక్తిపై కాల్పులు జరిపారు. దాంతో అతను మృతి చెందాడు. 
 
అలాగే ఆయన కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు గాయపడ్డారు. తొలుత వారిని అయోధ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం లక్నో ఆస్పత్రికి తరలించారు. అయితే కాల్పులు జరిపిన నలుగురిలో ఒకరిని అరెస్ట్‌ చేసినట్టు అయోధ్య పోలీసులు తెలిపారు. 
 
నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ముగ్గురిని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని ఎస్‌ఎస్‌పీ శైలేష్ పాండే చెప్పారు. దుర్గా పూజ నేపథ్యంలో ఈ కాల్పుల ఘటన జరిగినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. వ్యక్తిగత వివాదం వల్ల ఈ ఘటన జరిగిందని, కారణం ఏమిటన్నది తెలుసుకుంటున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments