Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంసారానికి రాలేదని, స్నేహితులతో కలిసి వెళ్లాడు.. భార్యను తుపాకీతో కాల్చేశాడు..

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (12:53 IST)
తాగిన మైకంలో స్నేహితులతో కలిసి ఓ భర్త భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన హర్కేష్ కుమార్-కవిత కుమారికి గత ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. హర్కేష్‌కు తాగుడు అలవాటు వుంది. ఈ అలవాటుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
ఎంత చెప్పినా భర్త తాగుడును వదిలిపెట్టకపోవడంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపట్ల ద్వేషాన్ని పెంటుకున్న హర్కేష్ కుమార్ తాగిన మైకంలో తన స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్లి.. భార్యతో వాగ్వివాదానికి దిగాడు. 
 
ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. అయితే తాగుడును మానితేనే ఇంటికి వస్తానని కవిత తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన హర్కేష్ తుపాకీతో ఆమెను షూట్ చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న హర్కేష్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments