Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంసారానికి రాలేదని, స్నేహితులతో కలిసి వెళ్లాడు.. భార్యను తుపాకీతో కాల్చేశాడు..

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (12:53 IST)
తాగిన మైకంలో స్నేహితులతో కలిసి ఓ భర్త భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన హర్కేష్ కుమార్-కవిత కుమారికి గత ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. హర్కేష్‌కు తాగుడు అలవాటు వుంది. ఈ అలవాటుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
ఎంత చెప్పినా భర్త తాగుడును వదిలిపెట్టకపోవడంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపట్ల ద్వేషాన్ని పెంటుకున్న హర్కేష్ కుమార్ తాగిన మైకంలో తన స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్లి.. భార్యతో వాగ్వివాదానికి దిగాడు. 
 
ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. అయితే తాగుడును మానితేనే ఇంటికి వస్తానని కవిత తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన హర్కేష్ తుపాకీతో ఆమెను షూట్ చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న హర్కేష్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments