Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్య కేన్సర్‌తో చనిపోయింది.. భర్త కూడా ముగ్గురు పిల్లలకు విషమిచ్చి?

కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఓ భర్త కలత చెందాడు. భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యుపిలోని ఆగ్రా నగరంలో సంచలనంగా మార

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (12:37 IST)
కట్టుకున్న భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో.. ఓ భర్త కలత చెందాడు. భార్య మృతిని తట్టుకోలేని ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన యుపిలోని ఆగ్రా నగరంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… ఆగ్రా నగర శివార్లలోని ఖైర్హే గ్రామానికి చెందిన మానసింగ్, రీనాదేవీ దంపతులకు ముగ్గురు పిల్లలు. 
 
అయితే, భార్య రీనాదేవి రెండు వారాల క్రితం కేన్సర్ వ్యాధితో చనిపోయింది. అప్పటి నుంచి భర్త మాన్ సింగ్ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. ఈ క్రమంలో భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త మాన్ సింగ్ ఆవేదనతో తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన భోజనం తినిపించి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఆ భోజనం తిన్న ముగ్గురు పిల్లలో రచన(11) తండ్రితో పాటు మరణించగా, రూపేష్ (13), అభయ్ (9)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఖైర్హే గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments