Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం... 17 రోజుల్లోనే జైలుశిక్ష

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (10:38 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో నాలుగేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడుకి కేవలం 17 రోజుల్లోనే జైలుశిక్ష పడింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
గత నెల 30వ తేదీన దయారాం మేఘ్వాల్ అనే వ్యక్తి సమీపంలో నివసించే నాలుగేళ్ళ చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారం జరిగిన మరుసటి రోజే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణ కోసం పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ రోజువారీగా సాగగా, ఈ నెల 7వ తేదీన చార్జిషీటును దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఏడు రోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టు 17 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్ష విధించడం గమనార్హం. పోక్సో చట్టం కింద ఇంత స్వల్ప సమయంలో నిందితుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments