Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం... 17 రోజుల్లోనే జైలుశిక్ష

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (10:38 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో నాలుగేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడుకి కేవలం 17 రోజుల్లోనే జైలుశిక్ష పడింది. ఈ మేరకు పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
గత నెల 30వ తేదీన దయారాం మేఘ్వాల్ అనే వ్యక్తి సమీపంలో నివసించే నాలుగేళ్ళ చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారం జరిగిన మరుసటి రోజే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణ కోసం పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ రోజువారీగా సాగగా, ఈ నెల 7వ తేదీన చార్జిషీటును దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఏడు రోజుల్లోనే పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టు 17 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి శిక్ష విధించడం గమనార్హం. పోక్సో చట్టం కింద ఇంత స్వల్ప సమయంలో నిందితుడికి శిక్ష పడడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments