నన్నూ.. నా భార్యను ఒక్కటి చేయలేదో... కొబ్బరి చెట్టుపై నుంచి దూకేస్తా...

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (09:50 IST)
సాధారణంగా చిన్న కోర్కెలు తీర్చకపోతే భార్యామణులు అలకపాన్పునెక్తుతుంటారు. ముఖ్యంగా వారికి నచ్చిన నగలు లేదా చీరలు తీసివ్వకపోతే ఆ పని చేస్తుంటారు. కానీ, ఇక్కడో భర్త ఏకంగా కొబ్బరిచెట్టు ఎక్కేశాడు. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు. తననూ తన భార్యను ఒక్కటి చేయకపోతే.. కొబ్బరి చెట్టుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని మంకుపట్టాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రంలోని కూడ్లిగి తాలూకాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  కర్ణాటకలోని కూడ్లిగి తాలూకాకు చెందిన 40 యేళ్ళ వయస్సున్న దొడ్డప్ప అనే వ్యక్తి భార్య ఆయన అలికి ఇంటికి వెళ్లిపోయింది. ఆమె ఎడబాటును తట్టుకోలేక పోయిన ఆయన.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 
 
అంతే.. తననూ, తన భార్యను ఒక్కటి చేయాలంటూ మంకుపట్టాడు. ఇందుకోసం ఏకంగా కొబ్బరి చెట్టు ఎక్కి 8 గంటల పాటు కూర్చొని నానా హంగామా చేశాడు. చెట్టుపై కూర్చుని తననూ, తన భార్యనూ ఒకటి చేయడంలో మీరంతా విఫలమయ్యారని ఊరి జనంపై దుమ్మెత్తిపోశాడు.
 
తరచుగా గొడవలు జరగడంతో ఐదేళ్ల క్రితం దొడ్డప్ప, అతని భార్య విడిపోయారు. భార్య లేకుండా.. ఇంటినీ, ముగ్గురు కొడుకులను చూసుకోవడం తన వల్ల కావడం లేదని చెట్టుపై నుంచి దొడ్డప్ప ఊరి జనానికి చెప్పేశాడు. దొడ్డప్ప భార్యతో మాట్లాడి ఎలాగోలా ఇద్దరినీ కలుపుతామని ఊరి జనం హామీ ఇచ్చిన తర్వాతే అతను చెట్టుపై నుంచి కిందకు దిగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

Balakrishna: మంచులో మేం సూట్ ధరిస్తే, బాలక్రిష్ణ స్లీవ్ లెస్ లో యాక్షన్ చేశారు : రామ్-లక్ష్మణ్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments