Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు భార్యలతో ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ మధ్యలోనే?

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (19:03 IST)
ముగ్గురమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఉల్లాసంగా వుండాలనుకున్నాడు.. కానీ ఊపిరి కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ధర్మపురిలోని నేచురల్స్ సలూన్‌లో పనిచేస్తున్న రాజా (30) తన మామ కుమార్తె సంధ్యను మొదటి వివాహం చేసుకున్నాడు. 
 
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఈ నేపథ్యంలో రాజాను తేనికి బదిలీ చేశారు. అక్కడికి వెళ్లిన రాజా.. ధనలక్ష్మి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇలా మరొక ఊరికి బదిలీ అయిన రాజా.. అక్కడ కావ్య (19) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. 
 
తనకు పెళ్లైన విషయాన్ని మరిచి ఇద్దరు మహిళలను రాజా పెళ్లాడాడు. ఇలా ఇద్దరు భార్యలతో ఉల్లాసంగా గడిపాడు. నాలుగోసారి పుదుచ్చేరికి బదిలీ అయిన రాజా కావ్యతో ఉల్లాసంగా గడిపాడు. కానీ రెండో భార్య ధనలక్ష్మికి పుదుచ్చేరికి రమ్మని పిలిచాడు. 
 
కానీ ఆమె నిరాకరించడంతో మనస్తాపంతో రాజా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి భర్త చనిపోయిన వార్త విని ముగ్గురు భార్యలు పుదుచ్చేరి లాడ్జికి వచ్చి చూశారు. దీంతో పోలీసులు షాకయ్యారు. రాజాకు ముగ్గురు భార్యలున్న సంగతి అప్పుడే అందరికీ తెలిసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

భవిష్యత్ లో ఎవరూ ఇలా చేయకూడదని మంచు విష్ణు ఉదంతంతో తెలుసుకున్నా : శ్రీవిష్ణు

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments