Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం తండ్రిని హత్య చేసి వడదెబ్బతో పోయాడని చెప్పిన కొడుకు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (18:02 IST)
దాచుకున్న డబ్బును కొట్టేశాడని తండ్రిని చంపి, వడదెబ్బ కొట్టి చనిపోయాడని కొడుకు నమ్మించిన ఘటన తమిళనాడులో జరిగింది. శవాన్ని పోస్ట్‌మార్టం చేయగా నిజం వెలుగులోకి రావడంతో నిందితుడు లొంగిపోయాడు. ఆంధ్ర సరిహద్దుల్లోని ఊత్తుకోట సెండ్రాంపాళ్యంలో ఉండే క్రిట్టినన్ అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
 
వ్యవసాయ కూలీగా జీవనం సాగించే ఇతను మద్యానికి బానిస అయ్యాడు. మద్యం త్రాగేందుకు డబ్బులు లేకపోవడంతో పెద్ద కొడుకు చిరంజీవి దాచుకున్న మూడు వేల రూపాయలను కాజేశాడు. దీంతో తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గొడవ పెద్దపై చిరంజీవి క్రిట్టినన్‌ను గొంతు నులిమి చంపేశాడు.
 
మూడురోజుల క్రితం వడదెబ్బ తగిలి తండ్రి మరణించినట్లుగా పెన్నాలూరుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించగా కారణం వెలుగుచూసింది. దాంతో పోలీసులు చిరంజీవిని నిలదీసి నిజం రాబట్టారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments