Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యను కడతేర్చాడు..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (13:24 IST)
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(31)తో పదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్లు కాపురం చేశాక విభేదాలు రావటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఆరేళ్ల కుమారుడు హరిచరణ్ ఆమె వద్దే వుంటున్నాడు. అనంతరం బాలవినయ్ మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య దీపిక తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని హిందూపురంలో కోర్టుకెక్కింది. ఈ నెల 27న విచారణ సందర్భంగా ఆమె హిందూపురానికి కుమారుడితోపాటు వచ్చింది. కేసు చివరిదశకు రావటం, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తెలుసుకున్న బాలవినయ్‌ ఆమెను ఇంటికి పిలిపించుకొని దాడికి పాల్పడ్డాడు.
 
అనంతరం పోలేపల్లి వద్ద చంపి పొలాల్లో కాల్చేశాడు. హరిచరణ్‌ను బెంగళూరులోని అమ్మమ్మ వద్ద వదిలేసి వచ్చి.. భార్యను చంపేశాడు. ఈ ఘటనపై దీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులో వచ్చింది. బాలవినయ్ ప్రస్తుతం పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments