Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలంద్వారంలో కేజీ బంగారం దాచి అక్రమ రవాణా..

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (08:32 IST)
కేరళలో ఓ విమాన ప్రయాణికుడి నుంచి దాదాపుగా కేజీకి పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలద్వారంలో ఈ బంగారాన్ని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన కేరళ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 
 
నిందితుడు బంగారాన్ని నాలుగు క్యాప్సుల్స్‌లో నింపి.. మలద్వారంలో దాచుకొని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోజికోడ్‌ జిల్లా కొడువాలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దోహా నుంచి బుధవారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతడి వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు అదుపులోకి తీసుకుని సోదాలు చేపట్టారు. 
 
ఈ తనిఖీల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది. అతడి నుంచి సుమారు 1066.75 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైలో నాలుగు వేర్వేరు ఘటనల్లో సుమారు 15 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 7.87 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments