Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన చంద్రబాబు : మమతా బెనర్జీ ఆరోపణ

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:36 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలుచేశారని ఆరోపించారు. బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొని ఈ సంచలన ఆరోపణలు చేశారు. 
 
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ తమ పోలీసులను వారు సంప్రదించారని బెనర్జీ వెల్లడించారు. అయితే తాను తిరస్కరించడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 
 
కాగా, ఇటీవల దేశ రాజకీయాల్లో పెగాసస్ సాఫ్ట్‌వేర్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇజ్రాయేల్‌కు చెందిన ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అనేక మంది ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments