Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెంగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన చంద్రబాబు : మమతా బెనర్జీ ఆరోపణ

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (11:36 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలుచేశారని ఆరోపించారు. బెంగాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ పాల్గొని ఈ సంచలన ఆరోపణలు చేశారు. 
 
పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ తమ పోలీసులను వారు సంప్రదించారని బెనర్జీ వెల్లడించారు. అయితే తాను తిరస్కరించడంతో ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 
 
కాగా, ఇటీవల దేశ రాజకీయాల్లో పెగాసస్ సాఫ్ట్‌వేర్ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఇజ్రాయేల్‌కు చెందిన ఈ స్పై సాఫ్ట్‌వేర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి అనేక మంది ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. పైగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments