Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ హింసాత్మక, హంతక పార్టీ: మమతా

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:45 IST)
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బీజేపీతో సంబంధం ఉన్న వారిని ముట్టుకోవడానికి కూడా తమ కార్యకర్తలు ఇబ్బంది పడతారని అన్నారు. 

బీజేపీని హింసాత్మక, హంతకపార్టీగా అభివర్ణించిన మమత.. తృణమూల్ కాంగ్రెస్ గూండాల పార్టీ కాదన్నారు. తన కాళీఘాట్‌ నివాసానికి సమీపంలో పార్టీ కార్యకర్త మృతదేహంతో బీజేపీ గురువారం ఆందోళనకు దిగడంపై మమత మండిపడ్డారు.

‘‘ఎన్నికల తర్వాత చాలా నెలలకు బీజేపీ కార్యకర్త మరణించినట్టు తెలిసింది. ఇలాంటివి దురదృష్టకరం. వారు ఆ మృతదేహంతో నా ఇంటికి వచ్చారు. ఎన్ఆర్‌సీ కారణంగా అస్సాంలో ఎంతోమంది చనిపోయారు. మీకు సిగ్గనిపించడం లేదూ? బీజేపీ పాలనలో చట్టమంటూ ఏమీ ఉండదా?’’ అని మమత విరుచుకుపడ్డారు.

జాతీయ పౌర రిజిస్టర్ ప్రచురణ నేపథ్యంలో అసోంలో చోటుచేసుకున్న మరణాలపై బీజేపీ నేతలను మమత టార్గెట్ చేసుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చట్టమంటూ ఏదీ ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం ఉప ఎన్నికలు జరగనున్న భవానీపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments