Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా వేదికగా మమతా మెగా షో.. తరలివచ్చిన నేతలు.. లక్షల్లో జనం

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (13:31 IST)
కోల్‌కతాలోని బిగ్రేడ్ మైదానంలో వేదికగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి వివిధ పార్టీల నేతల తరలివచ్చారు. అలాగే, ఈ సభకు లక్షల్లో జనం తరలివచ్చారు. ముఖ్యంగా, ఈ మెగా షోకు దేశం నలుమూలల నుంచి 25 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సభకు బీజేపీయేతర విపక్ష పార్టీలకు చెందిన నేతలు తరలిరావడం గమనార్హం. 
 
ఈ సభకు వచ్చిన వారిలో మాజీ ప్రధాని దేవగౌడ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్జేడీ చీఫ్ శరద్ పవార్, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లతోపాటు బీజేపీ మాజీ నేతలు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హాలు కూడా ఈ మెగా షోకు రావడం గమనార్హం. అలాగే, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments