Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి మమతా బెనర్జీ షాక్

Webdunia
శనివారం, 10 జులై 2021 (07:12 IST)
అధికార తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి ‘టెక్నికల్’ షాక్ ఇచ్చారు. బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించి, తిరిగి సొంతగూటికి చేరిన ముకుల్ రాయ్‌కు కీలక పదవిని అప్పజెప్పారు.పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ (పీఏసీ) గా ముకుల్ రాయ్‌ను నియమిస్తూ సీఎం బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

ఈయన నియామకాన్ని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ కూడా ఆమోదం తెలిపారు. వాస్తవానికి పీఏసీ చైర్మన్ ప్రతిపక్ష నేతకు ఇవ్వడం అన్ని రాజకీయ పక్షాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఒకే ఒక్క వ్యూహంతో సీఎం మమత బీజేపీని ఇరుకున పెట్టారు.

టెక్నికల్‌గా ముకుల్ రాయ్ ఇంకా బీజేపీ ఎమ్మెల్యేయే. ప్రతిపక్ష నేతకు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని తాము పాటించినట్లూ జరిగింది. అదే సమయంలో తమ పార్టీకే చెందిన ముకుల్ రాయ్‌‌కే ఈ పదవి ఇచ్చినట్లైంది. ఈ వ్యూహంతో బీజేపీ ఇరుకునపడినట్లేనని తృణమూల్ నేతలు పేర్కొంటున్నారు.

అయితే ముకుల్ రాయ్ నియామకంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. బీజేపీ టిక్కెట్‌పై ఆయన విజయం సాధించారని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేత సుబేందు నేతృత్వంలో ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ముకుల్ రాయ్‌ను పీఏసీ చైర్మన్‌గా నియమించి, అధికార తృణమూల్ నియమ నిబంధనలను తుంగలో తొక్కిందని సుబేందు తీవ్రంగా దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments