Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేకేఆర్ గెలుపు బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టింది : సీఎం మమతా బెనర్జీ

ఠాగూర్
సోమవారం, 27 మే 2024 (14:25 IST)
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. దీనిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విజయం బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'ఈ యేడాది ఐపీఎల్ సీజన్‌లో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీ.. ప్రతిఒక్కరికి నా వ్యక్తిగత అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో కూడా మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని అభిలాషిస్తున్నాను' అంటూ ఆమె పేర్కొన్నారు.
 
కాగా, పదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2024 ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అంతటా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అలాంటి వారిలో సీఎం మమతా బెనర్జీ కూడా చేరిపోయారు. నైట్ రైడర్స్ సాధించిన విజయం బెంగాల్ అంతటా అంబరాన్ని తాకే సంబరాలు తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments