Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌పై తగ్గేదే లేదు: సుప్రీంను ఆశ్రయించిన మమత

ఆధార్ అనుసంధానంపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమె ఇప్పటివరకు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు. ఇపుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు.

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2017 (07:28 IST)
ఆధార్ అనుసంధానంపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆమె ఇప్పటివరకు కేంద్రంతో పోరాటం చేస్తున్నారు. ఇపుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు.
 
మొబైల్‌, సిమ్‌ కార్డుల కనెక్షన్లకు ఆధార్‌ కార్డు లింకును తప్పని సరిచేస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు ఆమె తరపు న్యాయవాదులు శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సోమవారం కోర్టు విచారించనుంది. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్రం ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించిన దరిమిలా ఈ దావాకు ఎనలేని ప్రాధాన్యం లభించింది.
 
కాగా, ఇటీవల మమతా బెనర్జీ మాట్లాడుతూ... ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆధార్‌ కార్డు వివరాలను టెలికాం కంపెనీలకు ఇవ్వబోన్న ఆమె ప్రకటించిన విషయం తెల్సిందే. ‘అవసరమనుకుంటే నా మొబైల్‌ కనెక్షన్‌ రద్దు చేయండి’ అని గత వారం కేంద్రానికి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా కేంద్రం ‘ఆధార్‌ లింకు’ ఆదేశాలు జారీ చేసిందని ఆమె మొదటి నుంచీ వాదిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments