Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ లేకుండానే కాశ్మీర్ టు పంజాబ్ వరకు గూడ్సు రైలు పరుగులు...

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (08:41 IST)
పైలెట్, లోకో పైలెట్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఓ గూడ్సు రైలు డ్రైవర్లు లేకుండానే ఏకంగా కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు పరుగులు తీసింది. మొత్తం 53 వ్యాగన్లతో కూడిన ఈ రైలు సగటున 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కలకలం సృష్టించింది. ఈ గూడ్సు రైలు వెళుతున్న సమయంలో ఎలాంటి రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్‌ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకాశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R) జమ్మూలోని కథువా రైల్వేస్టేషన్‌లో కొంతసేపు ఆగింది. అయితే, లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే రైలింజన్ నుంచి దిగిపోయారు. 
 
పైగా, పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. అలా కదిలిన ఈ గూడ్సు రైలు.. గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికు ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్‌పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments