Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందుబాటిళ్లపై "తాగి వాహనాలు నడపవద్దు" హెచ్చరిక

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (13:56 IST)
ఇప్పటివరకు మద్యం బాటిళ్లపై "మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం" అనే ట్యాగ్ మాత్రమే ఉంది. అయితే మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో ఈ ట్యాగ్‌ను మరింత పొడిగించాలని భావిస్తోంది మహారాష్ట్ర సర్కార్. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హెచ్చరిక జారీ చేసింది. 
 
మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ జారీ చేసిన చట్టబద్ధమైన హెచ్చరికలో ఇక నుండి మద్యం బాటిళ్లపైన "మద్యం త్రాగడం ఆరోగ్యానికి హానికరం. మద్యం త్రాగకుండా సురక్షితంగా ఉండండి. మద్యం త్రాగి వాహనాలు నడపవద్దు" అని ముద్రించమని ఆదేశాలు జారీ చేసారు. మద్యం, బీరు బాటిళ్లపై ఈ హెచ్చరికను మరాఠీ భాషలో ముద్రించాలని మద్యం తయారీ సంస్థలను మహారాష్ట్ర సర్కారు ఆదేశించింది. 
 
ఏప్రిల్ 1వ తేదీ నుండి బయటకు వచ్చే మద్యం బాటిళ్ల లేబుల్‌లపై తప్పనిసరిగా ఈ హెచ్చరిక ఉండాలని ఆదేశించింది. ఈ హెచ్చరికను బాగా కనిపించే విధంగా పెద్ద అక్షరాల్లో ముద్రించాలని కూడా పేర్కొనడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments