Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న యువతి.. ఇంట్లోకి చొరబడి అత్యాచారం...

Webdunia
సోమవారం, 17 మే 2021 (08:16 IST)
మహారాష్ట్రలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ముగ్గురు స్థానిక వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం మహారాష్ట్రలోని బాంద్రా (వెస్ట్) జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాంద్రా వెస్ట్ జిల్లాలోని ఓ ప‌ట్ట‌ణంలో 19 ఏండ్ల యువ‌తిపై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఇంట్లో యువ‌తి ఒంటరిగా ఉన్న‌ద‌ని తెలిసి స్థానికంగా ఉండే ముగ్గురు వ్య‌క్తులు ఆ ఇంట్లో చొర‌బ‌డి దారుణానికి ఒడిగ‌ట్టారు. 
 
ఈ నెల 12న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై బాధిత‌ యువ‌తి త‌ల్లిదండ్రులతో క‌లిసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించ‌గా.. కోర్టు ఆ ముగ్గురికి ఈ నెల 19 వ‌ర‌కు పోలీస్ క‌స్ట‌డీ విధించింది.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments