Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఖడ్సే రాజీనామా.. దావూద్ ఫోన్‌కాల్స్ ఎఫెక్ట్!

Webdunia
శనివారం, 4 జూన్ 2016 (15:18 IST)
మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అందజేశారు. దీంతో మహారాష్ట్రలో హైడ్రామా రాజకీయాలకు తెరలేసింది. 
 
బీజేపీ మహారాష్ట్ర శాఖలో కీలక నేతగా ఎదిగిన ఖడ్సేకు అండర్ వరల్డ్ మాఫియా డాన్, భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెల్సిందే. దీనిపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన మండిపడింది. ఈ వ్యవహారం తేలకముందే ఖడ్సేపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
ఈ పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తికి ఖడ్సే ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఫడ్నవీస్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు వివరించారు. ఈ వ్యవహారంపై మోడీ, అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఖడ్సే దిగిరాక తప్పలేదు. దీంతో శనివారం ఢిల్లీకి చేరుకున్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments