Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీ బ్యాగులనూ ఈసీ అధికారులు తనిఖీ చేయాలి : ఉద్ధవ్ ఠాక్రే (Video)

ఠాగూర్
సోమవారం, 11 నవంబరు 2024 (19:37 IST)
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళుతుండగా తన లగేజీ బ్యాగులను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సీనియర్ నేతల బ్యాగులను కూడా తనిఖీ చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యావత్మాల్‌కు ఆయన హెలికాఫ్టర్‌లో వెళ్లారు. ఆయన హెలికాఫ్టర్ దిగగానే ఈసీ అధికారులు ఆయన హెలికాఫ్టర్‌తో పాటు లగేజీని కూడా తనిఖీ చేశారు. 
 
దీనిపై ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సీనియర్‌ నేతల బ్యాగులనూ ఎన్నికల అధికారులు చెక్‌ చేయాలన్నారు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని యావత్మాల్‌లోని వనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షేర్‌ చేసుకున్నారు. హెలికాప్టర్‌లో వనీకి చేరుకోగా.. కొందరు ఎన్నికల అధికారులు వచ్చి తన బ్యాగ్‌ను తనిఖీ చేశారని ఉద్ధవ్‌ తెలిపారు. బ్యాగ్‌ను తనిఖీ చేయడంపై మండిపడిన ఆయన.. అధికారుల జేబులు, గుర్తింపు కార్డుల్ని తమ పార్టీ కార్యకర్తలు, ఓటర్లూ తనిఖీ చేయాలన్నారు. 
 
ఎన్నికల అధికారులతో తనకు కోపం లేదన్న ఆయన.. 'మీరు మీ బాధ్యతలను అనుసరిస్తున్నారు. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నా. నా బ్యాగును తనిఖీ చేసినట్లే.. ప్రధాని మోడీ, అమిత్ షా బ్యాగులను చెక్‌ చేశారా? సీఎం ఏక్‌నాథ్‌ శిండే, డిప్యూటీ సీఎంలు అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవిస్‌ బ్యాగుల్ని తనిఖీ చేశారా? ఇలాంటి పనికిరాని పనులన్నీ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించలేను. ఇది ప్రజాస్వామ్యం కాదు.  ప్రజాస్వామ్యంలో చిన్నా, పెద్ద అనేది ఉండదు' అన్నారు.
 
ఎన్నికల అధికారులు అధికార కూటమి సీనియర్‌ నేతల బ్యాగులను తనిఖీ చేయకపోతే.. శివసేన (యూబీటీ) కార్యకర్తలు, విపక్ష కూటమి శ్రేణులే వారిని తనిఖీ చేస్తాయన్నారు.  ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు వారి బ్యాగులను తనిఖీ చేసే హక్కు ఓటర్లకు ఉన్నందున పోలీసులు, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోరాదన్నారు. మరోవైపు, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే బ్యాగును అధికారులు తనిఖీ చేస్తున్న వీడియోను శివసేన (యూబీటీ) తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసింది. అధికారులు బ్యాగును తనిఖీ చేస్తుండగా..  ఇతర నేతల బ్యాగుల్ని సైతం ఇలాగే తనిఖీ చేశారా?అని ఉద్ధవ్‌ ఠాక్రే అధికారుల్ని ప్రశ్నించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments