Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాయన కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌: 30మందికి అస్వస్థత

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (18:51 IST)
Gas
మహారాష్ట్రలోని ఓ రసాయన కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో 30 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. కర్మాగారం సమీపంలో నివసిస్తున్న స్థానికులు ఊపిరాడకపోవడం, కళల్లో మంట, వికారం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్‌ చీఫ్‌ సంతోష్‌ కదం తెలిపారు. అంబర్‌నాథ్‌లోని మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (MIDC)లో ఉన్న ఓ ప్లాంట్‌ నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ లీక్ అయినట్లు ఆయన చెప్పారు.
 
ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యలతో 34 మంది ఉల్లాస్‌నగర్‌లోని సెంట్రల్‌ ఆసుపత్రిలో చేరారినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, గ్యాస్‌ లీక్‌ కాకుండా చర్యలు చేపట్టారు. లీకేజీకి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు సంతోష్‌ కదం వివరించారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments