Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో రైతు ఇంట్లో 400 కేజీల టమోటాలు చోరీ

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (19:35 IST)
మహారాష్ట్రలోని పూణె‌లో ఓ రైతు ఇంట ఉంచిన టమోటాలు చోరీకి గురయ్యాయి. ఇంటిలో విక్రయానికి వచ్చిన టమోటాల్లో 400 కేజీలు చోరీకి గురయ్యారు. దీంతో స్థానిక పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర పూణెకు చెందిన ఓ రైతు తన పొలం నుంచి కోసుకొచ్చిన 400 కేజీల టమోటాలను రాత్రి ఇంటి బయట వాహనంలో ఉంచాడు. తెల్లారి చూసే సరికి ఆ సరకు మాయమైంది. దీంతో అతడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
 
శిరూర్‌ తహసిల్‌ పరిధిలోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్‌ ధోమే టమాటా సాగు చేశాడు. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో 400 కేజీల దాకా కోసి ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు మార్కెట్‌కు తరలిద్దామనే ఉద్దేశంతో వాటిని 20 పెట్టెల్లో సర్ది ఇంటి బయటే వాహనంలో ఉంచాడు. తెల్లవారుజామునే ఆ వాహనం దగ్గరకు వెళ్లి చూడగా అరుణ్‌కు టమాటా పెట్టెలు కన్పించలేదు. 
 
చుట్టుపక్కల గాలించినా లాభం లేకపోయింది. తన పంటను ఎవరో దొంగిలించారని నిర్ధారించుకున్న రైతు వెంటనే శిరూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రైతు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. టమాటాల దొంగతనంపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments