మూడో అంతస్తు నుంచి దూకేసిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ - ఇద్దరు ఎమ్మెల్యేలు

ఠాగూర్
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (16:04 IST)
మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ఆయన పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇదే పని చేశారు. అదృష్టవశాత్తు సేఫ్టీ నెట్స్‌లో పడటంతో వారికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. ఓ గిరిజన తెగగు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ సాహసం చేశారు. 
 
మహారాష్ట్రలోని ఉన్న తెగల్లో ఒకటైన ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఆయనతో పాటు మరో ఇద్దరు గిరిజన శాసనసభ్యులు కూడా కిందకు దూకేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అక్కడ నుంచి తరలించారు. అయితే, ఈ ఘటనలో మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇదిలావుంటే, ఎస్టీల్లో ధంగార్ తెగను చేర్చే అంశం మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్‌ను నిరసిస్తూ పలువురు గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవర్ వర్గానికి చెందిన నేత ఆందోళనకు దిగారు. ధంగార్ తెగకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎస్టీ రిజర్వేషన్ కల్పించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి పెసా (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ పొడిగింపు) చట్టం కింద సేవలు అందిస్తే సరిపోతుందని వీరంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్ కల్పించాలని భావిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments