Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైకర్లకు శుభవార్త.. ఇకపై సిటీ రైళ్లు.. కండిషన్ అప్లై...

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (11:58 IST)
దేశ ఆర్థిక రాజధానిలో ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థ సబర్బన్ రైళ్లు(లోకల్ ట్రైన్స్). ప్రతి నిత్యం కొన్ని లక్షల మంది ఈ రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నో రోజులుగా నిలిచిపోయిన లోకల్ రైళ్లు ముంబైలో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 
 
అయితే ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలనుకునేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కావాలి. అది కూడా రెండో డోసు వేసుకుని 15 రోజులు పూర్తయితేనే రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.
 
రైళ్లలో ప్రయాణం చేయాలని భావించేవారు మాస్క్, శానిటైజర్, వ్యక్తిగత శుభ్రత, స్టేషన్‌లో పాటించాల్సిన నియమాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేసింది. ఈ నెల 12 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. దీనికోసం ప్రత్యేక రైలు పాస్ తయారు చేస్తున్నారు. 
 
ఇంకా ఒక ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించనున్నారు. లోకల్ రైళ్ళలో ప్రయాణం చేసే వ్యక్తులు, తమ వ్యాక్సినేషన్ వివరాలను ఆ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. ఆ తర్వాతే లోకల్ రైళ్ళలో ప్రయాణం చేయవచ్చు. అలాకాకుండా ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే మాత్రం భారీ జరినామా తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments