Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో - 8 మంది దుర్మరణం (Video)

ఠాగూర్
సోమవారం, 13 జనవరి 2025 (10:04 IST)
నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో వ్యాను ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని జిల్లా, ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ద్వారకా సర్కిల్ వద్ద ఈ ఘోరం జరిగింది. 
 
నిషాద్‌లో జిరగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది తిరిగి టెంపోలో సిఐడీసీలో ప్రాంతానికి వెళుతుండగా వాహనం అదుపుతప్పింది. ఆ సమయంలో ఎదురుగా ఇనుప చువ్వలతో వస్తున్న ట్రక్కును టెంపో డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అలాగే, గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments