Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహంతి నరేంద్ర గిరి ఆత్మహత్య.. నిందితులకు లై డిటెక్టర్ పరీక్ష

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:37 IST)
ప్రయాగ్‌రాజ్‌లోని మఠంలో మహంతి నరేంద్ర గిరి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించాలని సీబీఐ ప్రయాగ్‌రాజ్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు పెట్టుకుంది. 
 
మహంతి నరేంద్ర గిరి మృతి కేసులో ఆనంద గిరి, ఆద్య తివారి, సందీప్ తివారీలపై అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ ముగ్గురికీ పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సీబీఐ భావిస్తోంది. మంగళవారం రోజున మెజిస్ట్రేట్ ముందు సీబీఐ దరఖాస్తు పెట్టింది.
 
అక్టోబర్ 18న సీజేఎం కోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది. నిందితులు కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరుకానున్నారు. అఖిల భారతీయ అఖాడా పరిషద్ అధ్యక్షుడు నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేలా నిందితులు రెచ్చగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
ప్రయాగ్‌రాజ్‌లోని భాగంబరి మఠంలో సెప్టెంబర్ 20వ తేదీన ఉరి వేసుకుని నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ముగ్గురు తనను మానసికంగా వేధించినట్లు మహంతి నరేంద్ర గిరి తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. ఐపీసీలోని 306 సెక్షన్ ప్రకారం ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments