Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలు తప్పిన రైలు.. పక్కకు ఒరిగిన 8 బోగీలు: యూపీలో ఘోరప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని మబోబా జిల్లా సమీపంలో మహాకోసల్ ఎక్స్‌ప్రెస్ ఘోరప్రమాదానికి గురైంది. గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగి పోయాయి. హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) నుంచి జబల్పూర్ (మధ్యప్రదేశ్) వెళుతుండగా రైలు ప్రమాదానికి గురైం

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (05:48 IST)
ఉత్తరప్రదేశ్‌లోని మబోబా జిల్లా సమీపంలో మహాకోసల్ ఎక్స్‌ప్రెస్ ఘోరప్రమాదానికి గురైంది. గురువారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో ఎనిమిది బోగీలు పక్కకు ఒరిగి పోయాయి.  హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) నుంచి జబల్పూర్ (మధ్యప్రదేశ్)  వెళుతుండగా రైలు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో గాయపడిన, మృతి చెందిన వివరాలు స్పష్టం కాలేదు కానీ  సహాయ చర్యలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. సీనియర్  అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం.
 
గత మూడునెలల్లో రైలు ప్రమాదాలు వరుసగా జరగటంతో ఉగ్రవాదుల కుట్రగా మొదట ఆరోపించిన కేంద్ర ప్రభుత్వం సురక్షిత రైలు ప్రయాణాలకు హామీ ఇవ్వడం కోసం కొరియా, జపాన్ వంటి దేశాల రైల్వే సంస్థల అధికార్లను ఆహ్వానించింది. ట్రాక్ సర్క్యూట్ విఫలమైన సందర్భాల్లో రైలు వేగాన్ని నియంత్రించాలని, డబుల్ చెక్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని, కొరియన్ రైల్వే నిపుణులు సూచించారు కూడా. కాని అవి ఆచరణలోకి వచ్చేసరికి ఇలాంటి ప్రమాదాలను దేశం చూడాల్సి ఉంటుంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments