Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నెల్ల గర్భిణి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (18:35 IST)
మహారాష్ట్రలోని థానేలో దారుణం జరిగింది. ఆరు నెలల గర్భంతో ఉన్న భార్యపై కట్టుకున్న భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణం మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లా క‌ల్వా ఏరియాలోగ‌ల మ‌ఫ‌త్‌లాల్ కాల‌నీలో శ‌నివారం సాయంత్రం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మ‌ఫ‌త్‌లాల్ కాల‌నీకి చెందిన అనిల్ బ‌హ‌దూర్ చౌరాసియా అనే వ్యక్తి భార్య ఉండ‌గానే మ‌రో మ‌హిళను పెళ్లి చేసుకున్నాడు. దాంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జరుగుతూ వచ్చాయి. 
 
ఈ క్ర‌మంలోనే గ‌త నెల 30న అనిల్ బ‌హ‌దూర్ భార్య‌తో గొడ‌వ‌ప‌డ్డాడు. ఆవేశంతో ఆర్నెల్ల గర్భంతో ఉన్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. మంట‌ల్లో చిక్కుకున్న బాధితురాలి అరుపులు విని అక్క‌డికి చేరుకున్న ఇరుగుపొరుగు ఆమెను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
వెంట‌నే ఆమెను ప‌రీక్షించిన వైద్యులు బాధితురాలి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని చెప్పారు. కాలిన గాయాల కార‌ణంగా ఆమె క‌డుపులోని బిడ్డ చ‌నిపోవ‌డంతో స‌ర్జ‌రీ చేసి పిండాన్ని తొల‌గించిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత‌నిపై ఐపీసీ సెక్ష‌న్ 307 ప్ర‌కారం కేసు న‌మోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments