Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (12:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో సోమవారం నుంచి మహా కుంభమేళా ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన సాధుసన్యాసులు వస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమం ఒడ్డున టెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13 యేళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఓ సాధువుకు దానమిచ్చారు. తమ కూతురిని సన్యాసినిగా మార్చాలని కోరారు. వారి నుంచి దానం స్వీకరించిన సాధువు.. ఆ బాలికను తమ అఖాడాలో చేర్చుకుని సన్యాసినిగా మార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా కూడా కథనాలు ప్రచురించింది. 
 
బాలిక రేఖకు జునా అఖాడాకు చెందిన మహంత్ కౌశల్ గిరి సన్యాసిని దీక్షను ప్రసాదించారు. ఈ విషయం తెలిసి జునా అఖాడా హెడ్ స్వామి అవదేశ్వరానంద్ గిరి జి మహారాజ్ స్పందించారు. 13 యేళ్ల బాలికను అఖాడాలో చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని, బాలికకు సన్యాస దీక్ష ఇవ్వడమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బాలికను దానంగా పుచ్చుకున్న మహంత్ కౌశల్ గిరిని, అఖాడాలో చేరి సన్యాస దీక్ష తీసుకున్న బాలిక రేఖను జునా అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వారిద్దరికీ అఖాదాతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments