Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (12:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో సోమవారం నుంచి మహా కుంభమేళా ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన సాధుసన్యాసులు వస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమం ఒడ్డున టెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13 యేళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఓ సాధువుకు దానమిచ్చారు. తమ కూతురిని సన్యాసినిగా మార్చాలని కోరారు. వారి నుంచి దానం స్వీకరించిన సాధువు.. ఆ బాలికను తమ అఖాడాలో చేర్చుకుని సన్యాసినిగా మార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా కూడా కథనాలు ప్రచురించింది. 
 
బాలిక రేఖకు జునా అఖాడాకు చెందిన మహంత్ కౌశల్ గిరి సన్యాసిని దీక్షను ప్రసాదించారు. ఈ విషయం తెలిసి జునా అఖాడా హెడ్ స్వామి అవదేశ్వరానంద్ గిరి జి మహారాజ్ స్పందించారు. 13 యేళ్ల బాలికను అఖాడాలో చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని, బాలికకు సన్యాస దీక్ష ఇవ్వడమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బాలికను దానంగా పుచ్చుకున్న మహంత్ కౌశల్ గిరిని, అఖాడాలో చేరి సన్యాస దీక్ష తీసుకున్న బాలిక రేఖను జునా అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వారిద్దరికీ అఖాదాతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments