Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (11:42 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు చిరుత కలకలం సృష్టంచింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ చిరుత కంటపడింది. దీంతో వాకింగ్ చేస్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత అక్కడ నుంచి చెట్ల పొదల్లోకి వెల్లిపోయినట్టు వాకర్స్ చెప్పారు. చిరుత పాద ముద్రలను గుర్తించిన వాకర్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. 
 
కాగా, ఈ విషయం తెలిసిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నగర్‌లో గతంలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. నాలుగేళ్ల క్రితం హిమాయత్ సాగర్‌ వాలంటరీ రీసెర్స్ వ్యూమ్ హౌస్ సమీపంలో ఆవులపై చిరుత దాడి చేసిన విషయం తెల్సిందే. ఒక ఆవు దూడను చిరుత చంపడం అప్పట్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఇపుడు ఏకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలోకి చిరుత ప్రవేశించడం స్థానికులతో పాటు వాకర్స్‌ను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments