Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికనేర్ వాసులను వణికించిన భూకంపం - రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (09:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌ సమీపంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.1గా నమోదైంది. బికనేర్ సమీప ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఉలిక్కపడి లేచి తీవ్ర భయంతో వీధులు, రోడ్లపైకి పరుగులు తీశారు. 
 
బికనేర్ నగారనికి 236 కిలోమీటర్ల దూరంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని బికనేర్ అధికారులు చెప్పారు. 
 
కాగా, శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. శుక్రవారం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిఠోరాగడ్ ప్రాంతంలో భూమి కంపిచింది. అంతకుముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వరుస భూకంపాలు పెద్ద భూకంపం వచ్చేందుకు ప్రమాద హెచ్చరికగా ప్రజలు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments