లాడ్జిలో ఒకే గదిలో అమ్మాయి - అబ్బాయి ఉంటే తప్పేంటి?

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (10:38 IST)
మద్రాసు హైకోర్టు ఓ కీలక తీర్పును వెలువరించింది. లాడ్జీలో ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉంటే తప్పులేదని స్పష్టం చేసింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండడం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జిలోని ఒక గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయన్న కారణాలతో పోలీసులు ఇటీవల ఆ లాడ్జిని మూసివేయించారు. లాడ్జి యాజమాన్యం దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. 
 
కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం.. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికాని యువతీయువకులు ఒకే గదిలో ఉండకూడదని చట్టంలో లేదని, కాబట్టి అదెలా తప్పవుతుందని ప్రశ్నించింది. 
 
పైగా, సహజీవనాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టంచేసింది. అలాగే, లాడ్జి గదిలో మద్యం సీసాలు ఉండడాన్ని కూడా తప్పుబట్టలేమని, అవి ఉండడంతో ఆ లాడ్జి అక్రమంగా బార్ నిర్వహిస్తోందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. లాడ్జి మూసివేతలో నిబంధనలు పాటించలేదని పోలీసులకు మొట్టికాయలు వేసింది. వెంటనే లాడ్జీకి వేసిన సీలును తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments