Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో ఒకే గదిలో అమ్మాయి - అబ్బాయి ఉంటే తప్పేంటి?

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (10:38 IST)
మద్రాసు హైకోర్టు ఓ కీలక తీర్పును వెలువరించింది. లాడ్జీలో ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉంటే తప్పులేదని స్పష్టం చేసింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండడం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జిలోని ఒక గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయన్న కారణాలతో పోలీసులు ఇటీవల ఆ లాడ్జిని మూసివేయించారు. లాడ్జి యాజమాన్యం దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. 
 
కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం.. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికాని యువతీయువకులు ఒకే గదిలో ఉండకూడదని చట్టంలో లేదని, కాబట్టి అదెలా తప్పవుతుందని ప్రశ్నించింది. 
 
పైగా, సహజీవనాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టంచేసింది. అలాగే, లాడ్జి గదిలో మద్యం సీసాలు ఉండడాన్ని కూడా తప్పుబట్టలేమని, అవి ఉండడంతో ఆ లాడ్జి అక్రమంగా బార్ నిర్వహిస్తోందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. లాడ్జి మూసివేతలో నిబంధనలు పాటించలేదని పోలీసులకు మొట్టికాయలు వేసింది. వెంటనే లాడ్జీకి వేసిన సీలును తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments