Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జిలో ఒకే గదిలో అమ్మాయి - అబ్బాయి ఉంటే తప్పేంటి?

Webdunia
ఆదివారం, 8 డిశెంబరు 2019 (10:38 IST)
మద్రాసు హైకోర్టు ఓ కీలక తీర్పును వెలువరించింది. లాడ్జీలో ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉంటే తప్పులేదని స్పష్టం చేసింది. అవివాహిత జంట ఒకే గదిలో ఉండడం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు లాడ్జిలోని ఒక గదిలో అవివాహిత జంట, మరో గదిలో మద్యం సీసాలు ఉన్నాయన్న కారణాలతో పోలీసులు ఇటీవల ఆ లాడ్జిని మూసివేయించారు. లాడ్జి యాజమాన్యం దీనిని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. 
 
కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం.. అవివాహిత జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదని, అలాగని చట్టం చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికాని యువతీయువకులు ఒకే గదిలో ఉండకూడదని చట్టంలో లేదని, కాబట్టి అదెలా తప్పవుతుందని ప్రశ్నించింది. 
 
పైగా, సహజీవనాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టంచేసింది. అలాగే, లాడ్జి గదిలో మద్యం సీసాలు ఉండడాన్ని కూడా తప్పుబట్టలేమని, అవి ఉండడంతో ఆ లాడ్జి అక్రమంగా బార్ నిర్వహిస్తోందని చెప్పలేమని వ్యాఖ్యానించింది. లాడ్జి మూసివేతలో నిబంధనలు పాటించలేదని పోలీసులకు మొట్టికాయలు వేసింది. వెంటనే లాడ్జీకి వేసిన సీలును తొలగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments