Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. 2 రోజుల పాటు..?

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:42 IST)
మధ్యప్రదేశ్‌లోని సహదోల్‌ జిల్లాలో ఓ యువతి (20)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు నరకం చూపించారు. నిందితుల్లో జైత్‌పుర్‌ మండల భాజపా నేత విజయ్‌ త్రిపాఠీ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంపై వచ్చిన నలుగురూ ఆమెను అపహరించి గడఘాట్‌ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. 
 
ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను ఇంటి ముందు వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు అదనపు ఎస్పీ ముఖేశ్‌ వైశ్‌ తెలిపారు. కాగా త్రిపాఠీని వెంటనే పార్టీ నుంచి తొలగించినట్లు భాజపా ప్రకటించింది.
 
అలాగే మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. జబల్‌పుర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు కుందామ్‌ ఠాణా పోలీసులు తెలిపారు. దుకాణానికి వెళ్లిన బాలికను తీసుకెళ్లి అతను దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments